Tuesday, April 30, 2024

సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పుల కలకలం

సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.. వివరాల్లోకి వెళితే.. చేర్యాలకు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేటలోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వచ్చారు. ప్లాట్ విక్రయ డబ్బులు 43 లక్షలు కొనుగోలుదారు నుంచి నర్సయ్య తీసుకొని డ్రైవర్ కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి కెళ్లాడు.

ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్ పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్ తో కాల్చారు.. మరో వ్యక్తి మరోవైపు నుంచి కారు డోర్లు తెరిచి 43 లక్షల నగదు ఎత్తుకొని ఇద్దరు ఆగంతకులు బైక్ పై పారిపోయారు. ఆగంతకులు కాల్చిన గన్ ను కారులోనే వదిలి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement