Monday, April 29, 2024

టీడీపీకి గుడ్ బై – క‌న్నీళ్లు పెట్టుకున్న దివ్య‌వాణి

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మంచి విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని..ఎప్పుడైనా ఇదే చెబుతాన‌న్నారు మ‌హిళా నేత దివ్య‌వాణి తెలిపారు. కాగా క‌న్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ నాయ‌కురాలు..బుద్ధిలేని వాళ్లు బుద్ధి లేని మాట‌లు మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది..అందుకే రాజీనామా చేయ‌డం లేద‌ని అంటున్నార‌ని వాపోయారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు క్లారిటీ తీసుకునేందుకే ఆగాన‌న‌న్నారు. ఏడాదిగా పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గించార‌ని అన్నారు దివ్య‌వాణి. ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌న్నారు. నేను ఎప్పుడూ, ఎవ‌రికీ భ‌జ‌న చేయ‌న‌ని చెప్పారు దివ్య‌వాణి. టీడీపీకి గుడ్ బై..అని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకున్నారామె. తాను హైద‌రాబాద్ నుంచే వ‌చ్చి వెళుతున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement