Thursday, April 18, 2024

అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాల‌కు .. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి, భార్య పరిస్థితి విషమం

చిట్యాల (ప్రభ న్యూస్): భార్య కొడుకుతో అత్తగారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న భూపాల‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ జిల్లా చిట్యాల మండ‌లంలో ఈ రోజు జ‌రిగింది. కాగా, ప్రమాదవశాత్తు బైకు ట్రాక్టర్ ను ఢీకొట్ట‌డంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే చనిపోగా భార్యకు తీవ్ర గాయాల‌య్యాయి. పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి త‌ర‌లించారు. మంగళవారం రాత్రి మండలంలోనినైన్ పాక శివారులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..

భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నుండి నైన్ పాక సమీపంలో బతుకమ్మ విగ్రహం వద్ద ట్రాక్టర్ టూ వీలర్ ఢీకొని ఇద్దరు చ‌నిపోయారు, ఒకరు గాయపడ్డారు. శాయంపేట మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నవీన్, మేఘన వారి కుమారుడు పని నిమిత్తం అత్తగారింటికి చిట్యాల మండలంలోని అందుకుతండకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. నైన్ పాక ఊరి చివర్లో రోడ్డుపై ఎదురుగా వస్తున్న నైన్ పాక గ్రామానికి చెందిన పెద్దమల్ల కుమార్ ట్రాక్టర్ ను ఢీకొనగా మారేపల్లి నవీన్(28 )అతని ఏడాదిన్న‌ర వ‌య‌సున్న కుమారుడు అక్కడికక్కడే చ‌నిపోయారు.

న‌వీన్‌ భార్య మేఘనకు తీవ్ర గాయాల‌య్యాయి. ఘటనా స్థలాన్ని డి.ఎస్.పి సంపత్ రావు, చిట్యాల సిఐ పులి వెంకట్, ఎస్ ఐ కృష్ణ ప్రసాద్ ప‌రిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంతో పాటు రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement