Saturday, April 20, 2024

కౌన్సిలర్‌, అత‌ని అనుచరుల వేధింపులు.. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం

సత్తెనపల్లి, (ప్రభన్యూస్): గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం జరిగింది. 22వ వార్డ్ కౌన్సిలర్, అతని అనుచరుల వేధింపులు తాళలేక మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. సమీప బంధువులు వారి పరిస్థితి గమనించి ఆస్పత్రికి తరలించారు. 22వ వార్డుకి చెందిన మళ్ళెంశెట్టి శివశంకర్, సూరిశెట్టి గోపిని కౌన్సిలర్ శెట్టి ఆనంద్, రాడ్ల శ్రీనుతోపాటు వారి అనుచరులు కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు.

సత్తెనపల్లిలోని 22వ వార్డులో ఎవరైనా తమ పార్టీ కోసమే పనిచేయాలి తప్ప, వేరే ఆలోచన చేస్తే తగిన గుణపాఠం చెప్తామని పదే పదే హెచ్చరించటంతో తాము ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఆ యువకులు విలపిస్తూ చెప్పారు. ఈ ఘటన పట్టణంలో దావాణంలా వ్యాపించడంతో తీవ్ర చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement