Friday, April 26, 2024

Hyd Drugs Case: డ్రగ్​ పెడ్లర్​ ఎడ్విన్​ దొరికాడు.. గోవాలో అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు

కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ న్యూన్స్​ ని డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గోవాలోని అంజునా నుండి అతడిని హైదరాబాద్​కి తరలించారు. సెప్టెంబర్‌లో బీజేపీ లీడర్​ సోనాలి ఫోగట్ మరణం తర్వాత అరెస్టయిన ఐదుగురిలో నన్స్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతను నిన్న బెయిల్‌పై బయటకు వచ్చాడు. దీంతో తెలంగాణ పోలీసులు గోవా వెళ్లి డ్రగ్స్​ కేసులో అరెస్టు చేశారు. కాగా, ఫోగట్ మృతి కేసును సీబీఐ విచారిస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మూడు నెలల క్రితం తెలంగాణలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ తర్వాత హైదరాబాద్‌లో పోలీసులు వెతుకుతున్న డజన్ల కొద్దీ డ్రగ్స్ డీలర్లలో న్యూన్స్ కూడా ఉన్నాడు. COVID-19 సర్టిఫికేట్‌ను ట్యాంపర్​ చేసినందుకు గోవా అంజునాలోని పోలీసుల ముందు లొంగిపోవాలని ఈ వారం ప్రారంభంలో మపుసాలోని అదనపు సెషన్స్ కోర్టు నూన్స్ ను ఆదేశించింది. దీంతో తెలంగాణలోని లాలాగూడకు చెందిన పోలీసులు గోవాలో క్యాంపింగ్ చేస్తున్నాడని తెలుసుకున్నారు.

నిన్న బెయిల్ బయటికి వచ్చిన వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. కోర్టు విధించిన బెయిల్ షరతులతో అతను పోలీసు కస్టడీ నుండి బయటపడ్డాడు. అప్పటికే హైదరాబాద్‌కు చెందిన పోలీసులు అతని కోసం వెయిట్​ చేస్తున్నారు. తెలంగాణలో అతనిపై నమోదైన కేసులపై వారు పనాజీలో అదుపులోకి తీసుకున్నారు అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివిధ కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసినప్పటి నుంచి నూన్స్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.

అతను అరెస్టు నుండి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయగా, తెలంగాణ హైకోర్టు గత వారం నవంబర్ 7వ తేదీన లాలాగూడ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. న్యూన్స్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది తన క్లయింట్‌పై నిర్దిష్ట ఫిర్యాదు ఏమీ లేదని వాదించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే నూన్స్ అనేక కేసులలో ప్రమేయం ఉన్నాడని.. గోవా నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్ పెడ్లర్ అని పలు ఆధారాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement