Saturday, May 4, 2024

యూపీలో ఎన్ కౌంట‌ర్.. గ్యాంగ్ స్ట‌ర్ కుమారుడు అస‌ద్ అహ్మ‌ద్ హ‌తం

గ్యాంగ్ స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్ కుమారుడు అస‌ద్ అహ్మ‌ద్ ని ఎదురుకాల్పుల్లో పోలీసులు హ‌త‌మార్చారు. కాగా అత‌ని వ‌ద్ద నుండి విదేశీ త‌యారీ ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు..ఈ ఎన్ కౌంట‌ర్ యూపీ ఝాన్సీ వ‌ద్ద జ‌రిగింది.ఈ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. అస‌ద్ అహ్మాద్ , గులామ్‌ల‌ను పోలీసులు హ‌త‌మార్చారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఈ ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు. ఉమేశ్ పాల్ మ‌ర్డ‌ర్ కేసులో అస‌ద్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో అస‌ద్‌పై 5 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. యూపీ స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నేడు ఝాన్సీలో అత‌న్ని ఎన్‌కౌంట‌ర్ చేశారు.సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ న‌వేందు, డిప్యూటీ ఎస్పీ విమ‌ల్ నాయ‌క‌త్వంలో ఆ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఉమేశ్ మ‌ర్డ‌ర్ కేసులో అతిక్ అహ్మాద్‌ను నేడు ప్ర‌యాగ్‌రాజ్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement