Sunday, May 5, 2024

అక్టోబ‌ర్ 2నుంచి – ప్ర‌శాంత్ కిషోర్ పాద‌యాత్ర

మూడు వేల కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. అక్టోబ‌ర్ 2వ తేదీన ఈ పాద‌యాత్ర ప్రారంభం కానుంది.త‌న పాద‌యాత్ర‌లో వీలైనంత మందిని క‌ల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బీహార్‌లో ఇప్పుడేమీ ఎన్నిక‌లు లేవ‌ని, ఇక ఇప్ప‌ట్లో రాజ‌కీయ పార్టీని స్థాపించే ప్ర‌ణాళిక ఏదీ లేద‌న్నారు. రాబోయే మూడు లేదా నాలుగేళ్లు ప్ర‌జ‌లకు చేరువ‌య్యే ప‌నిలో నిమ‌గ్నం కానున్న‌ట్లు చెప్పారు. కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టే ఆలోచ‌న నుంచి వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే బీహార్‌ను బ‌లోపేతం చేసేందుకు అంకితం కానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement