Sunday, April 28, 2024

Maharashtra : ఆయిల్ ట్యాంకర్ లో మంటలు.. నలుగురు సజీవదహనం

ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం కాగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలైన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రంలోని ముంబై-పూణె హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. లోనావాలా సమీపంలోని వంతెనపై ఆయిల్​ ట్యాంకర్​లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు సహా మరో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో ముంబయి-పుణె ఎక్స్​ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement