Friday, April 26, 2024

Big Breaking | కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

వరంగల్​ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​రెడ్డి సోదరుడు చనిపోయారు. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయ్యింది. గీసుగొండ మండలం గంగదేవిపల్లి శివారులో ఇవ్వాల (శనివారం) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

గీసుగొండ (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ చ‌నిపోయారు. గీసుగొండ మండ‌లం గంగదేవిపల్లి సమీపంలో కారు, బస్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో మాజీ ఎమ్మెల్యే సోద‌రుడు మ‌ర‌ణించారు. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయిపోయింది. కారు నడుపుతున్న కేసముద్రం మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే సోద‌రుడు అయిన‌ వేం పురుషోత్తంరెడ్డి అక్కడిక‌క్కడే మృతిచెందారు. పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్‌రెడ్డికి పురుషోత్తంరెడ్డి పెద్దన్న.

Advertisement

తాజా వార్తలు

Advertisement