Saturday, April 20, 2024

మైనార్టీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి.. గ‌వ‌ర్న‌ర్‌కు మైనార్టీ మోర్చా విన‌తి

ముత్తుకూరు (ప్రభ న్యూస్) : ఏపీలో మైనార్టీల సమస్యలను ప‌రిష్క‌రించేలా చొర‌వ చూపాల‌ని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు బీజేపీ మైనార్టీ మోర్చా వినతి పత్రం అందించింది. ఇవ్వాల (శ‌నివారం) ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ షఫీ ఉల్లా ఆధ్వ‌ర్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి సమస్యలను విన్న‌వించారు. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో ఎంపిక కోసం ఇచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని, అదేవిధంగా దుల్హన్ స్కీమ్‌ నిర్వీర్యం చేశార‌ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement