Sunday, April 28, 2024

Braking: తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకుంటున్నారు. సీనియర్లను పట్టించుకోవడం లేదంటూ.. నిజమైన కాంగ్రెస్ నాయకులం మేమేనంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. కొంత మంది రాజీనామాలు చేస్తున్నామని అంటున్నారు. అయితే ఆ పరిస్థితిని చక్కదిద్ధేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీని సరైన గాడిలో పెట్టేందుకు అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement