Monday, April 29, 2024

రైతులు తిర‌గ‌బ‌డ‌క ముందే ధాన్యం కొనుగోలు చేప‌ట్టాల‌న్న ష‌ర్మిల ..

ఇది పంట‌లు వేసుకునే యాసంగి కాలం అని చెప్పినా.. మీకు ఆ కాలం కూడా వెళ్లిపోతుంద‌ని తెలియ‌డం లేదా దొరా అని వైయ‌స్సార్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల .. కేసీఆర్ పై మండిప‌డ్డారు. పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పిన మాటల మొనగాడు ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే కొన్నాడని దుయ్య‌బ‌ట్టారు. ధాన్యం కొంటాడో, కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ మాత్రం ధాన్నాన్ని కొనకుండా రాజకీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారామె. ఇప్పటికే రెండు నెలలుగా వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారని .. రైతులు తిరగబడక ముందే పంట మొత్తం కొనాలని… లేకపోతే కేసీఆర్ మూట ముళ్లె సర్దుకోవాల్సిందేనని ఆమె జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement