Thursday, April 25, 2024

కార్యకర్తలో చర్చలు… ఆతర్వాతే కార్యాచరణ!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్‌పై పోరుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ హుజూరాబాద్‌లో కార్యకర్తలతో మరోసారి ఈటల భేటీ కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై కార్యకర్తలతో ఈటల చర్చించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే అవకాశం ఉంది.

19 సంవత్సరాలుగా తనతో నడుస్తున్న అభిమానులకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈటల. కాట్రపల్లిలో స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆతర్వాత  భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. రెండు రోజుల్లో పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయని, తన ప్రయాణం గురించి తెలియజేస్తానని ఈటల ప్రకటించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement