Monday, April 29, 2024

ముగిసిన కీమో – స‌ర్జ‌రీల‌కు స‌మ‌యం ఆసన్న‌మైంది – హంసానందిని

రీసెంట్ గా క్యాన్స‌ర్ బారిన ప‌డింది న‌టి హంసానందిని. తాను కీమో థెర‌పీని కంప్లీట్ చేశానిన ఇన్ స్టా గ్రామ్ లో వెల్ల‌డించింది.ఆనంద్.. 16 సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. నేను ఇప్పుడు అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ, చికిత్స ఇంకా పూర్తి కాలేదు. తదుపరి పోరాటానికి సన్నద్ధం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది’’అంటూ హంసా నందిని పేర్కొంది. ఆ పక్కనే ఆస్పత్రి ఫొటో పోస్ట్ చేసింది.తలపై వెంట్రుకలు పూర్తిగా తొలగించిన ఫొటోను 2021 డిసెంబర్ లో షేర్ చేస్తూ తాను కేన్సర్ బారిన పడినట్టు హంసా నందిని ప్రకటించింది. హంసా నందిని అమ్మ కూడా బ్రెస్ట్ కేన్సర్ తోనే మరణించారు. అదే మహమ్మారి హంసాకూ సోకింది. చిరునవ్వుతో పోరాడతాను, విజయం సాధిస్తానంటూ ఆమె లోగడ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement