Sunday, April 28, 2024

ఎన్నిక‌ల్లో విజ‌యోత్స‌వాల‌పై నిషేధం ఎత్తేసిన – ఎన్నిక‌ల సంఘం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి క్లియ‌ర్ క‌ట్ గా మెజారిటీ సాధించింది. ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మీ క్లీన్ స్వీప్ చేసింది.
దీంతో బీజేపీ, ఆప్ శ్రేణుల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు విజయోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షిస్తూ… కౌంటింగ్ తరువాత విజయోత్సవ ఊరేగింపులపై మార్గదర్శకాలను సడలించాలని నిర్ణయించింది. ఎన్నికల్లో విజయోత్సవాలపై నిషేధాన్ని ఎత్తేసింది. కాగా ఈ సడలింపులు స్టేట్ డిజాస్టర్ మేనేజింగ్ అథారిటీ నివారణ చర్యలకు లోబడి.. జిల్లా అధికారులు విధించిన చర్యలకు లోబడి ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement