Saturday, April 27, 2024

తెలంగాణలోని గ్రానైట్ కంపెనీలకు షాకిచ్చిన ఈడీ

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్ కోణంలో ఇప్పటివరకు ఈడీ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. పలు కంపెనీలు తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు గ్రానైట్ తరలింపులో అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.800 కోట్లు గండి కొట్టారని నిర్ధారించింది. అక్రమాలకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేయాలంటూ ఈడీ లేఖలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement