Sunday, April 28, 2024

అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ.. ఈటల ఎమన్నారంటే..

తెలంగాణలో చంద్రశేఖర్ రావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లలో నిలబడితే సస్పెండ్ చేయటం అనైతికమని మండిపడ్డారు. సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలే బొందపెడతారని ఈటల హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement