Thursday, May 2, 2024

ఇరాన్ లో భూకంపం-ముగ్గురు మృతి-19మందికి గాయాలు

ఈమ‌ధ్య‌కాలంలో త‌ర‌చుగా ప‌లుచోట్ల భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఇరాన్ లో భారీ భూకంపం వ‌చ్చింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్‌ అబ్బాస్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. బందర్‌ అబ్బాస్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప ప్రభావంతో ముగ్గురు మరణించారని, 19 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది..హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లో గతేడాది నవంబర్‌లో 6.4, 6.3 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు వచ్చాయి. 1990లో వచ్చిన 7.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంతో సుమారు 40 వేల మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement