Saturday, April 27, 2024

ఆసిఫాబాద్ లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో నేటి ఉదయం భూప్రకంపనలు కలకలం చోటుచేసుకున్నాయి. ఆయా మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలకు కేంద్రం కావచ్చని అధికారులు అంటున్నారు. స్పల్పంగా కంపించడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. అలాగే ఈ మండలాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూమి కంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement