Tuesday, May 21, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడువంద‌ల మంది తాగుబోతులు .. కేసు న‌మోదు ..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిన్న రాత్రి 300మంది తాగుబోతుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. బంజారాహిల్స్ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ని పోలీసులు ముమ్మ‌రం చేశారు. కాగా నిన్న ఒక్క రోజే.. జంట నగరాల్లో 124 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్‌లు న‌మోదు అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో 50కి పైగా కేసులు న‌మోదు అయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటే తప్పించుకునేందుకు కొంత మంది ప్ర‌యత్నం చేశారు. పోలీసులను చూసి పరారయ్యారు ప‌లువురు. బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం చేసిన రోహిత్, సుమన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని 14 రోజులు రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement