Friday, May 17, 2024

ముంబైలో రూ.4.9 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

దేశంలో ఎక్కడో ఒక చోట నిషేధిత డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా.. ముంబై ఎయిర్‎పోర్టులో నిషేధిత మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా… కెన్యా ప్రయాణికురాలి దగ్గర కొకైన్ గుర్తించారు. చెప్పుల కింద భాగంలో దాచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 490 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.4.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం సదరు మహిళపై ఎన్డీఫీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement