Thursday, May 16, 2024

డాక్ట‌ర్ గిరికుమార్ – మీరు క్షేమంగా ఉండాలి – మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ఉక్రెయిన్ లో స్థిర‌ప‌ప‌డ్డారు ఏపీ త‌ణుకు ప‌ట్ట‌ణానికి చెందిన డాక్ట‌ర్ గిరికుమార్. ఈ మేర‌కు డాక్టర్ గిరికుమార్ ఇండియాకు తాను రాలేనని ఓ వీడియో ద్వారా చెప్పాడు. దీనికి కారణం ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఓ జాగ్వార్ , ఓ పాంథర్. తాను ఇండియాకు తిరిగొస్తే ఇవి తిండి లేకుండా చచ్చిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీటిని వదిలేయలేక, వీటి కోసం ఇక్కడే ఉన్నానని చెప్పారు. ఆయన వీడియో ఎందరో హృదయాలను కదిలించింది. మూగ జీవాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అక్కడే ఉన్న ఆయనకు ఎంతో మంది బరువెక్కిన హృదయాలతో హ్యాట్సాఫ్ చెపుతున్నారు. గిరికుమార్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా కదిలిపోయారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. ‘ ప్రియమైన డాక్టర్ గిరికుమార్… జాగ్వార్, పాంథర్ లపై మీకున్న ప్రేమ నన్ను టచ్ చేసింది, నాలో స్ఫూర్తిని నింపింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇండియాకు రాకుండా, వాటి కోసం అక్కడే ఉండాలనుకోవడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయం. ఈ ఛాలెంజింగ్ సమయంలో మీరు అక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పరిస్థితులు చక్కబడేంత వరకు మీరు క్షేమంగా ఉండాలి. గాడ్ బ్లెస్ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement