Saturday, May 11, 2024

ఆటోలో ఓట‌ర్ల‌ని పోలింగ్ కేంద్రానికి చేర్చిన.. డీకే శివ‌కుమార్

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం క‌న‌క‌పుర‌లో ఆటో న‌డిపి ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని పోలింగ్ కేంద్రానికి చేర్చారు కర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్. ఓ వైపు క‌ర్ణాట‌క‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంటే.. మరోవైపు శివ‌కుమార్ ఆటో నడుపుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆయన ఆటో నడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది ఇలా ఉండ‌గా కర్ణాటక వ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మాండ్యా జిల్లాలో మంత్రి నారాయణ ఇంటిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 30 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement