Wednesday, May 1, 2024

ఉగ్ర కుట్ర కేసులో నిందితులకు కస్టడీ..!

హైదరాబాద్ నగరంలో ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మొత్తం 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో నిందితులను భోపాల్ తరలించిన అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. దీంతో 16 మంది నిందితులను కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీ వరకు నిందితులను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement