Thursday, April 18, 2024

Spl Story | ధోనీ రిటైర్​మెంట్​పై చర్చోపచర్చలు.. ఇంకా డిసైడ్​ చేయని మిస్టర్​ కూల్​!!

ఐపీఎల్​ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మిస్టర్​ కూల్​.. కెప్టెన్​ ధోని.. అతని ఆటతీరు, ఫీల్డింగ్​ నిర్వహణ, కీపింగ్​ స్టైల్​, బ్యాటింగ్​లోనూ హెలికాప్టర్​ షాట్స్​ వంటివి అభిమానులు గుర్తు చేసుకుంటారు. మరి అట్లాంటి మిస్టర్​ కూల్​ గురించి చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఫస్ట్​ అతని రిటైర్​మెంట్​ ఈ సీజన్​తో ఉంటుందని. కానీ, ధోనీ భయ్యా ఇంకా ముడు, నాలుగు సీజన్లపాటు ఆడుతారని కెప్టెన్​ రోహిత్​శర్మ చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో మాత్రం ధోనీ ఎలాంటి కామెంట్​ చేయలేదు.. పైగా దీనిపై ఏ నిర్ణయమూ ప్రకటించలేదు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఎం.ఎస్.ధోనీ ఐపీఎల్‌కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? క్రికెట్ అభిమానుల మధ్య చాలా కాలంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అటు మీడియా వర్గాల్లోనూ ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడు.. అప్పుడు అనే ప్రచారం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని ఫార్మట్లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ ధోనీకి చివరిదని, ఈ టోర్నీ తర్వాత ఆయన ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో 41 ఏళ్ల కెప్టెన్ కూల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న ఊహాగానాలు అతని ఫ్యాన్స్ ‌కు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా రెండు మూడు సీజన్ల పాటు ధోనీ ఐపీఎల్‌లో కొనసాగాలని కోరుకుంటున్నారు. గత ఐపీఎల్‌ తర్వాత ఎక్కడా క్రీజులో కనిపించని ధోనీ, ఈ ఐపీఎల్ తొలి రోజు ఆటలో అడుగుపెట్టనున్నారు. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సూటిగా సమాధానమిచ్చారు. ధోనీ మరో రెండు మూడేళ్ల పాటు గ్రాండ్ లీగ్‌లో కొనసాగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

రెండేళ్లుగా ఇదే చర్చ..

- Advertisement -

రెండుమూడేళ్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయని రోహిత్ శర్మ గుర్తుచేశారు. అయితే ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని.. మరికొన్ని సీజన్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ధోనీ రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ చేసిన కామెంట్స్ పట్ల ధోనీ ఫ్యాన్స్, సీఎస్కే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరికొన్ని సీజన్లు ఐపీఎల్‌లో కొనసాగే సత్తా ధోనీకి ఉందంటున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ ఈ నెల 31న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌‌లో రాయల్ చాలెంజ్స్ బెంగళూరును రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. ఈ మ్యా్చ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 2న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement