Thursday, April 25, 2024

ఎలుక‌మాంసం రుచి చూశా..హీరోయిన్ లిజో మోల్ జోస్..

ఎలుక‌మాసం తిన్నానని తెలిపింది హీరోయిన్ లిజో మోల్ జోస్..ఎవ‌రీమె..అనుకుంటున్నారా..హీరో సూర్య ప్ర‌ధాన‌పాత్ర‌లో తెర‌కెక్కిన జై భీమ్ చిత్రంలో న‌టించి మెప్పించింది. సూర్య పాత్ర ఈ సినిమాలో ఎంత కీల‌కంగా ఉంటుందో..పోలీస్ లాక‌ప్‌లో చ‌నిపోయిన బాధితుడు రాజ‌న్న భార్య సిన‌త‌ల్లి పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ సుంద‌రి లిజోమోల్ జోస్ పాత్ర‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సూర్య పాత్ర కంటే ఈమె పాత్రే సినిమాలో ప్రధాన‌మైంది. ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి లిజోమోల్ జోస్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. జై భీమ్ సినిమా క‌థ‌ను డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ చెప్ప‌గానే పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీ ఎంటో అర్థ‌మైంది. పాత్ర చాలా బాగా న‌చ్చింది.

దీంతో పాత్ర కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందులో భాగంగా, డైటింగ్ చేసి బ‌రువు కూడా త‌గ్గాను. అలాగే నేను చేసింది గిరిజ‌న స్త్రీ పాత్ర‌. అంత సుల‌భంగా చేయ‌లేం. కాబ‌ట్టి గిరిజ‌న తెగ‌కు చెందిన మ‌హిళ‌ల‌ను క‌లుసుకుని వారితో కొన్ని రోజ‌లు గ‌డిపాను. వాళ్లు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ స‌మ‌యంలో ఏ ఔష‌ధాల‌ను ఉప‌యోగిస్తార‌నే విష‌యాల‌ను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో క‌లిసి ఎలుక‌లు ప‌ట్ట‌డానికి కూడా వెళ్లి, వారెలా ప‌డుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాన‌ని తెల‌ప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement