Friday, April 19, 2024

మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ చార్జీలు వద్దు

ప్ర‌భ‌న్యూస్ :రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ ధియేటర్లలో ప్రజల వద్ద నుంచి పార్కింగ్‌ రుసుం వసూలు చేయడాన్ని నియం త్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సం స్థలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ ధియేటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పార్కింగ్‌ రుసం వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

గతంలో ఇచ్చిన ఆదేశాలనే నిర్ధేశించిన సంస్ధలు, సినిమాహాళ్లు పాటిం చాలని, ప్రజల వద్ద నుంచి పార్కింగ్‌ రుసం వసూలు చేయరాదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన సూచనలను యథాతథంగా కొనసాగిస్తూ , అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement