Tuesday, April 30, 2024

పూజాతో ఆ సీన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల‌య్యా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో ఓ రేంజ్ లో సినిమాని తెరకెక్కించారు. ‘రాధేశ్యామ్’ సినిమా అనేక వాయిదాల తర్వాత ఈ నెల 11న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘రాధేశ్యామ్ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అవి తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి కొన్ని కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్ తప్పకుండా ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కిస్ సీన్స్ అవాయిడ్ చేసే చాన్స్ ఉంటుంది. కానీ, ఇది లవ్ స్టోరీ తప్పకుండా చేయాల్సిందే’’ అని డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పడంతో నో చెప్పలేకపోయాను అంటే అసలు విషయం వెల్లడించాడు డార్లింగ్​ ప్రభాస్​..

‘‘పూజా హెగ్డేతో కిస్ సీన్స్ లో నటించాల్సి వచ్చింది. కిస్ సీన్స్ లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, కాని, తప్పలేదు. ఇక ఓ రొమాంటిక్ సీన్ లో షర్ట్ తీసేసి నటించాల్సి వచ్చింది. అప్పుడు చాలా సిగ్గు పడ్డాను. ఆ టైంలో సెట్స్ లో ఎంత మంది ఉన్నారు అని లెక్కబెట్టుకున్నా. చాలా మంది ఉండటంతో డైరెక్టర్ రాధాకృష్ణతో మరో లొకేషన్ లో చేద్దాం అని అడిగాను. అప్పుడు ‘ఛత్రపతి’ సినిమాలో రాజమౌళి తనచేత షర్ట్ విప్పించారని గుర్తు చేసి ఈ సీన్ చేయించాడు” అని తెలిపాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు, వారి మధ్య కిస్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement