Saturday, April 27, 2024

ముందస్తు మొక్కులు: మేడారానికి పోటేత్తిన భక్తులు.. క్యూ లైన్ల ద్వారా అనుమతి

తాడ్వాయి ( మేడారం) ప్రభన్యూస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా తరిలి వచ్చి తల్లులను దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు దేశంలో రాష్ట్రంలో కోవిడ్, ఓమిక్రాన్ వెరియంట్ విజ్రుంబిస్తుండటంతో ముందస్తుగానే భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు వివిధ ప్రాంతాలైన హైదరాబాద్ నల్గొండ,కరింనగర్, ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ రంగారెడ్డి, నుంచి కాకుండా, ఛత్తీస్గఢ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భక్తులు తరలివచ్చారు.

ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్య స్థానాలు ఆచరించి గద్దేలవద్దకు చెరుకుని పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలు ఎత్తు బెల్లం కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన మ్యుజీయం, సారలమ్మ గుడి,చిలుకలగుట్ట ప్రాంతంలో కలీయ తిరిగారు, కుటుంబం సమేతంగా వచ్చిన భక్తులు కోళ్లను మేకలను గొర్రెలను తల్లులకు నైవేద్యం గా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.వంటలు చెసుకుని తిని తిరిగి వెళ్లారు.ఈ సందర్భంగా పోలీసులు, ఎలాంటి ఇబ్బందులూ తలేత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement