Friday, May 3, 2024

Demonetization – ఎన్నిక‌ల‌లో గెలించేందుకే రెండు వేల నోట్లు ర‌ద్దు – సిపిఐ నారాయణ

న్యూఢిల్లీ : రాబోయే ఎన్నిక‌ల‌లో గెలిచేందుకే రూ.2వేల నోట్ల‌ను బిజెపి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని సిపిఐ జాతీయ స‌హాయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నిజంగానే మోదీ ప్రభుత్వానికి బ్లాక్ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల‌ నోట్లను ఎప్పుడో రద్దు చేయాల్సి ఉండేదన్నారు. రూ. 500, రూ. 1000 రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. ఈ దేశంలో అవినీతి లేదని చెప్పిన‌ బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతుందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా మోడీ ప్రభుత్వానికి బ్లాక్ మనీ అంతం చేయాలని చిత్తశుద్ధి ఉంటే మార్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ర‌ద్దు చేశావార‌న్నారు..

ఇది ఇలా ఉంటే రెజ్ల‌ర్ గ‌త నెల రోజుల‌గా ఢిల్లీ జ‌రుపుతున్న ఆందోళ‌న‌ల‌పై స్పందించిన నారాయ‌ణ కుస్తీ వీరులు ఢిల్లీ రోడ్ల మీద‌ ఆందోళన చేస్తుంటే.. మోడీ ప్రభుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లుగా లేద‌న్నారు. అంతర్జాతీయంగా క్రీడల్లో రాణించి పథకాలు సాధించిన మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. ఎంపీ బ్రిడ్జ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement