Thursday, May 9, 2024

Delhi : ప్రారంభ‌మైన ఏఐసీసీ స‌మావేశం

ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు సమావేశమ‌య్యారు. అయితే ఈ స‌మావేశానికి సోనియా గాంధీకి బ‌దులుగా ప్రియాంక హాజ‌ర‌య్యారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని భావించిన పార్టీ అధిష్టానం ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈక్రమంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై ఈరోజు పార్టీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమిని విశ్లేషించుకుంటూ ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాను కలిసిన జి-23 నేతల బృందం పలు సూచనలు చేసిన విష‌యం విధిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement