Friday, April 26, 2024

ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌గా ఢిల్లీ.. నోటిఫికేష‌న్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

దేశ రాజ‌ధాని ఢిల్లీని ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌గా పేర్కొంటూ కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్రం ఇవ్వాల ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం సిటీలో 3 మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు ఉండ‌గా.. ఇక‌పై మూడింటిని విలీనం చేస్తూ ఢిల్లీ న‌గ‌రం మొత్తాన్ని ఒకే కార్పొరేష‌న్ కింద‌కు తీసుకువ‌చ్చింది. ఇదివ‌ర‌కే ప్ర‌తిపాదించిన ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2022ను కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు ఢిల్లీలోని 3 మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల ఏకీక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఈ నెల 22 నుంచి ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు కానుంది. ఢిల్లీలోని 3 మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను విలీనం చేసే ప్ర‌క్రియ‌లో కేంద్రం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే ఢిల్లీ మునిసిప‌ల్ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని కేంద్రం ప్ర‌తిపాదిస్తోందని ఆయ‌న ఆరోపించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోకుండా తాను అనుకున్న ప‌నిని పూర్తి చేసేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement