Friday, May 10, 2024

నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు వ‌దిలిపెట్టం – మంత్రి విడ‌ద‌ల ర‌జిని

నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు మా ప్ర‌భుత్వం వ‌దిలిపెట్ట‌ద‌ని హెచ్చ‌రించారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. రేప‌ల్లె రైల్వే స్టేష‌న్ లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారన్నారు. ఇప్ప‌టికే పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారన్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్ప‌త్రి అధికారుల‌తో మాట్లాడామని స్పష్టం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని రేప‌ల్లె ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించామన్నారు. ప్ర‌స్తుతం బాధితురాలు వైద్య సిబ్బంది ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉన్నారని వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని… బాధితురాలికి, ఆమె కుటుంబానికి మా ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement