Tuesday, May 21, 2024

తగ్గుతున్న కరోనా… కొత్తగా 5439 పాజిటివ్‌ కేసులు

రోజు రోజుకు దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement