Friday, May 3, 2024

KNR | భట్టి పాదయాత్రలో ఢిష్యుం డిష్యుం.. ఇరువర్గాల దాడిలో తీవ్ర గాయాలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పెద్దపెల్లి జిల్లాలోని బొంపల్లి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. ఓదెల జెడ్పీటీసీ గంట రాములు వర్గీయుడికి తల పగిలి గాయాలయ్యాయి. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బాహాబాయికి దిగారు. ఓదెలకు చెందిన నర్సింగ్ పై విజయరమణారావు వర్గీయులు దాడి చేసి తల పగలగొట్టారు. దీంతో గంటరాములు వర్గీయులు నిరసనకు దిగారు. విజయ రమణారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement