Friday, May 10, 2024

COVID-19: మద్రాస్‌ ఐఐటీలో 55కు చేరిన కరోనా కేసులు

మద్రాస్‌ ఐఐటీలో కరోనా కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీలో కరోనా బాధితుల సంఖ్య 55కు చేరిందని తమిళనాడు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ చెప్పారు. ఇప్పటివరకు 1420 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 55 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్‌లో ఐసోలైషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాగా, చెన్నై మినహా 13 రాష్ట్రాల నుంచి ఫ్రెషర్లు ఇటీవల ఇక్కడికి చేరుకున్నారు. వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా ఇతరులకు కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిందని అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement