Friday, April 26, 2024

రవీంద్ర జడేజా భార్య, తల్లికి కోర్టు సమన్లు

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబాకు, ఆమె తల్లికి జామ్‌నగర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ రోడ్డు ప్ర‌మాదం కేసులో విచార‌ణ‌కు రావాల‌ని కోర్టు సమన్లలో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి వారిద్ద‌రికి పంపిన స‌మ‌న్లే ఆఖరి సమన్లని పోలీసులు చెప్పారు. ఆ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు వారు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. గ‌తంలో రివాబాకు స‌మ‌న్లు పంపినా హాజ‌రుకాలేదు.
గుజ‌రాత్‌, జామ్‌నగర్‌లోని సరు సెక్షన్‌ రోడ్డులో 2018లో ఓ ప్ర‌మాదం చోటు చేసుకుంది. రివాబా కారు కానిస్టేబుల్ అహిర్‌ మోటార్‌సైకిల్‌ సహా మరో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బాధితులకు స్వల్పగాయాలయ్యాయి. అయితే ఆ కోపంలో సదరు కానిస్టేబుల్ రివాబాపై దాడి చేశాడని స్థానికులు చెప్పారు. ఆమెపై దాడికి దిగిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అప్ప‌ట్లో పోలీసులు అన్నారు. అనంత‌రం రివాబా ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ అహిర్‌కు బెయిల్ వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement