Thursday, April 25, 2024

ప్రధాని హత్యకు కుట్ర.. 14 మందికి ఉరిశిక్ష

బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా హత్యకు కుట్రపన్నిన 14 మందికి ఆ దేశ ఉన్నత న్యాయస్థానం మరణశిక్షను విధించింది. దోషులందరూ నిషేధిత హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్​(హుజీ-బి)కి చెందిన ఉగ్రవాదులు. 2000 జులై 21న గోపాల్‌గంజ్‌ కోటలిపారా ప్రాంతంలో ఎన్నికల ప్రచార ర్యాలీకి హాజరైన హసీనాను హత్య చేసేందుకు వీరంతా 76 కిలోల బాంబును అమర్చారు. మొత్తం 14 మందిలో తొమ్మిది మందిని విచారణ నిమిత్తం కోర్టులో హజరుపరిచారు. పరారీలో ఉన్న ఐదుగురు లొంగిపోయిన అనంతరం తీర్పును అమలు చేయాలని న్యాయమూర్తి అబు జాఫర్​ మొహమ్మద్​ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement