Wednesday, April 24, 2024

కోర్టును ఆశ్ర‌యించిన హీరోయిన్ జాక్వెలిన్ – విదేశీ ప్ర‌యాణానికి అనుమ‌తివ్వండి

విదేశీ ప్ర‌యాణానికి అనుమ‌తించాల‌ని బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండైజ్ ఢిల్లీ కోర్టుని ఆశ్ర‌యించింది. జాక్వెలిన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పర్యవేక్షణలో ఉంది. దోపిడీ కేసును ఎదుర్కొంటున్న లాబీయిస్ట్ సుకేశ్ చంద్రశేఖర్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండడం, సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించినట్టు ఈడీ విచారణలో ఆమె అంగీకరించడం తెలిసిందే. దీంతో జాక్వెలిన్ కు సంబంధించి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా తనను అనుమతించాలని కోరుతూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్, నేపాల్ లోనూ పర్యటించాల్సి ఉందని కూడా ఆమె తెలిపింది. ఈడీ పర్యవేక్షణలో ఉన్నందున అనుమతి లేకుండా ఆమె విదేశీ ప్రయాణానికి వెళ్లడానికి లేదు. గత డిసెంబర్ లోనూ ఆమెను ముంబై ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement