Monday, April 29, 2024

Flash: ఆస్ట్రేలియా నుంచి వస్తూ అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

ఆస్ట్రేలియా నుంచి సొంత గ్రామానికి వస్తూ భార్యాభర్తలు అనంత లోకాలకు వెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన హేమాంమ్ బరధర్, రజిత దంపతులు వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. సోమవారం ఆస్ట్రేలియా నుండి స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. వీరు హైద్రాబాద్ లో దిగిన తర్వాత కిరాయి వాహనంలో స్వగ్రామానికి వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చివ్వెంల మండలం గుంపుల గ్రామం చేరుకునేసరికి డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొట్టడంతో హేమంమ్ బరధర్,రజితలు అక్కడికక్కడే మృతిచెందారు.  వారి పిల్లలను బాబుకు కాలు ఫ్రాక్చర్ కాగా పాపకు స్వల్ప గాయాలయ్యాయి. చివ్వెంల ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement