Wednesday, May 15, 2024

పెరిగిన క‌రోనా కేసులు-కొత్త‌గా 15,940

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నేడు ఆ సంఖ్య 15,940కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,33,78,234కు చేరాయి. ఇందులో 4,27,61,481 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా 5,24,974 మంది మరణించారు. మరో 91,779 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 20 మంది మరణించగా 12,425 మంది డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువవడంతో యాక్టివిటీ రేటు 0.21 శాతానికి పెరిగింది. రికరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 196.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement