Sunday, May 5, 2024

Covid19: తెలంగాణలో కరోనా విజృంభణ.. 1913 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న 54,534 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,913 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,214 మందికి పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 213, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 161 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 232 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,036కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,87,456 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇందులో 6,75,573 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసుల ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement