Friday, May 3, 2024

టాప్ గేర్ లో కరోనా బండి…ఈ ఏడాదికి ఇదే రికార్డ్

దేశంలో కరోనా మరోసారి మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. రెండు నెలలు తరువాత మొదటి సారి అత్యధికంగా 25 వేలకు చేరువలో కేసులు నమోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంటల కొత్త‌గా 24,882 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది.

మరోవైపు ఈ క‌రోనా కార‌ణంగా 24 గంటల్లో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,58,446కి చేరింది. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,02,022 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement