Sunday, April 28, 2024

యూపీలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు : నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. కోవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు రోజు వారి ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో యూపీలో కొత్త‌గా 842 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌త‌ వారం 15వేల ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 8వేల‌కు ప‌డిపోయింది. దీంతో నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా నైట్ క‌ర్ఫ్యూను ఎత్తివేశారు. క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హోంశాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అవ‌నిశ్ అవాస్తి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement