Friday, May 3, 2024

క‌రోనా కేసులు పెరుగుతున్నాయి-ప‌రిస్థితిని పర్య‌వేక్షిస్తున్నాం-కేజ్రీవాల్

క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఏయే చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తున్నాం. చాలా వరకు కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటుండటం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయ స్థాయిలో పెరుగుతున్నాయని.. అయితే చాలా కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి ఆందోళనేదీ అవసరం లేదన్నారు. పరీక్షలు చేసిన ప్రతి ఆరుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement