Saturday, May 11, 2024

మూడురోజుల త‌ర్వాత ప‌ట్టాలెక్కిన.. కోర‌మండ‌ల్ ఎక్స్ ప్రెస్

మూడురోజుల త‌ర్వాత మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది కోర‌మండ‌ల్ ఎక్స్ ప్రెస్. కాగా ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement