Monday, April 29, 2024

ఈటలకు 30 వేల మెజార్టీ.. కాంగ్రెస్ ఓట్లపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

హుజురాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీని షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆధిక్యంలోనే ఉన్నారు. ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాడని కోమటిరెడ్డి అన్నారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. హుజురాబాద్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రజలు అదిరి పోయే తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు ఈటెలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement