Friday, April 26, 2024

చలో రాజ్ భవన్.. కాంగ్రెస్ నేతల అరెస్టు

ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు మోతె రోహిత్ నేతృత్వంలో రాజ్ భవన్ వద్ద జెండాలు ఎగురవేసి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్ట్ ఉన్నప్పటికి రాజ్ భవన్ లోకి దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు.  విడతల వారిగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి వచ్చారు. దీంతో ఎప్పటికప్పుడు ముట్టడికి వస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వర్షంలోనూ  పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వర్షంలోను పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. 

కాంగ్రెస్ నేత‌ల ఫోన్ ట్యాపింగ్‌కి నిర‌స‌న‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీని నిర్వ‌హించి రాజ్‌భ‌వ‌న్ ముందు ఆందోళ‌న నిర్వ‌హించి గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఇందిరాపార్క్ వ‌ద్ద‌కు వచ్చారు. వ‌ర్షాన్నిసైతం లేక్క‌చేయ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే, ర్యాలీకి అనుమ‌తి లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులను  పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement