Friday, May 17, 2024

‘ఏపీసీసీ’ అధ్య‌క్షుడి రేసులో ఉన్న‌ది వీరే

ఏపీలో కాంగ్రెస్ త‌మ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేసింది. అధ్య‌క్షుడి ఎంపిక కోసం ఏపీ ఇంఛార్జీ ఉమ‌న్ చాందీ ప‌లువురు రాష్ట్ర నేత‌ల అభిప్రాయాలు సేక‌రించారు. కాగా వీరిలో ఏపీ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాలు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు.

ఉమన్ చాందీ బృందం సంప్రదించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులు కూడా ఉన్నారు.ముఖాముఖి సమావేశాలతో అందరి అభిప్రాయాలను ఉమన్ చాందీ తీసుకున్నారు. అధ్యక్షుడి రేసులో చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్షకుమార్ ఉన్నట్టు విశ్వసనీయ స‌మాచారం. వీరి ముగ్గురిలో ఒకరికి ఏపీసీసీ అధ్యక్ష భాధ్యతలు దక్కనున్నాయి. జనవరి మొదటి వారంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఈ నివేదికను అందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement