Friday, April 26, 2024

కరుణించిన RBI.. వడ్డీరేట్లు యదాతథం..

ఆర్థిక మాంధ్యం ప్రభావంతో మళ్లీ వడ్డీ రేట్లు పెంచుతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచి కరుణించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇవాళ ప్రకటించారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ గతేడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది ఆర్​బీఐ. అంతకుముందు ఫిబ్రవరిలో రెపో రేటును పెంచింది ఆర్​బీఐ. 6.25 శాతం ఉన్న రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచి 6.5 శాతంగా నిర్ధరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement